ఆ సినిమాకి రూ. 50కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్న సాయి పల్లవి

by Prasanna |
ఆ సినిమాకి రూ. 50కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్న సాయి పల్లవి
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఎందుకంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ రూటే సపరేట్.. గ్లామర్ రోల్స్ ఉన్న ఏ మూవీ చేయదు.. కథలో తన పాత్రకి ప్రాధాన్యత ఉంటే తప్ప ఏ సినిమాలలో కూడా నటించదు. మలయాళ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సాయి పల్లవి. ప్రేమమ్ హిట్ అయినా తర్వాత, తెలుగులో ఫిదా సినిమాతో ఆడియెన్స్ ని అలరించింది.ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ ఆమె దగ్గరికి వచ్చాయి. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది.ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది.

ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న రామాయణం మూవీలో నటిస్తుంది. సాయి పల్లవి నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ ముద్దుగుమ్మ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది.

బాలీవుడ్‌ మూవీ రామాయణంలో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది ఈ చిత్రానికి సంబంధించిన లీక్ అయిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీలో సాయి పల్లవి సీతగా అందర్ని ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం సాయి పల్లవి 50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. రామాయణం మూవీని మూడు పార్ట్ లుగా తీయనున్నారు. డేట్స్ కోసం, అందుకు తగ్గ పారితోషికం ఇస్తున్నారని సినీ వర్గాలు వారు చెబుతున్నారు.

Next Story

Most Viewed