- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
హీరో రాజ్ తరుణ్ గుడిలో పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ పోలీస్ స్టేషన్లో ప్రియురాలు ఫిర్యాదు!
దిశ, సినిమా: ప్రజెంట్ ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్పై లావణ్య అనే అమ్మాయి చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమెను పెళ్లి చేసుకుంటానని రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది. అంతేకాకుండా రాజ్ తరుణ్తో 11 ఏళ్ల నుంచి రిలేషన్ ఉన్నానని మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. కానీ అంతకుముందే తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది.
అంతేకాకుండా రాజ్ తరుణ్ నా ప్రపంచం, నాకు కావాలి న్యాయం చేయాలంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అతని ఫ్రెండ్స్ కూడా వదిలేయకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తనను కొందరు ఇంతకు ముందు డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారని కానీ రాజ్ తరుణ్ ఎలాంటి సాయం చేయలేదని తనను మోసం చేశాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం లావణ్య రాజ్ తరుణ్పై చేసిన ఆరోపణలు నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై రాజ్ తరుణ్ స్పందిస్తే కానీ క్లారిటీ రాదు.