- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
ఎవడ్రా మనల్ని ఆపేదంటూ..చేతిలో గ్లాస్,జనసేన జెండాతో పవన్ గెలుపును సెలబ్రేట్ చేసుకున్న నటి !
దిశ, సినిమా : ఈసారి ఏపీ ఎన్నికల ఫలితాలు ఊహించని విధంగా వచ్చాయి. అనుకోని విధంగా వైసీపీ ప్రభుత్వం ఓటమిపాలై, కూటమి ఘన విజయం సాధించింది. మరీ ముఖ్యంగా ఈ ఫలితాల్లో అందరి చూపు పిఠాపురం వైపే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుపు, ఫలితాలకు ముందే ఖాయమైపోయింది. వచ్చిన అన్ని సర్వేలు ఆయన గెలుపును ఖరారు చేశాయి. కానీ పవన్ కళ్యాణ్ అంత అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చాలా తక్కువ మంది ఊహించారు. అంతే కాకుండా జనసేన తరఫున పోటీలోకి దిగి 21కి 21 మంది గెలిచి, తమ సత్తా చాటారు. దీంతో పవన్కు ప్రముఖులు, సెలబ్రిటీలు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ గెలుపుకు సంబంధించిన పోస్టులే దర్శనం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నటి సరేఖ వాణి కూతురు పవన్కు డిఫరెంట్గా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన విజయాన్ని ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో సుప్రిత వైట్ పంచ, జైన జనసేన అని ఉన్న టీషర్ట్ ధరించి కనిపిస్తుంది. అంతే కాకుండా ఆ డ్రెస్లో గాజు గ్లాస్ పట్టుకొని ఆమె చిందులు వేసింది. అంతే కాకుండా జనసేన జెండాను పట్టుకొని తనదైన స్టైల్లో స్టెప్స్ వేస్తూ.. ఎవడ్రా మనల్ని ఆపేది అనే థీమ్ సాంగ్కు అదిరిపోయే స్టెప్స్ వేసింది. అంతే కాకుండా మరో వీడియో షేర్ చేస్తూ తన తల్లితో కలిసి రా రా.. రారా బంగారం అనే పాటకు డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.