స్టార్ హీరో ధనుష్ నన్ను చూసి అసూయపడ్డారు.. యంగ్ నటి కామెంట్స్ వైరల్

by sudharani |
స్టార్ హీరో ధనుష్ నన్ను చూసి అసూయపడ్డారు.. యంగ్ నటి కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: యంగ్ నటి దుషారా విజయన్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్’ చిత్రంతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇందులో ధనుష్ చెల్లెలు పాత్రలో కనిపించిన ఈ అమ్మడు.. తన నటనతో సినీ ప్రియులను కట్టిపడేసింది. ఇప్పుడు ఈ బ్యూటీ.. సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న ‘వెట్టైయాన్’లో నటిస్తుంది. టి.జె జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలకపాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్‌తో సందడి చేస్తు్న్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యంగ్ నటి దుషారా విజయన్ ధనుష్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

‘‘రాయన్’, ‘వెట్టైయాన్’ సినిమా షూటింగ్స్ ఒకే సమయంలో జరిగాయి. అప్పుడు నేను రజినీకాంత్ ‘వెట్టైయాన్’లో చేస్తున్నాను. అది తెలుసుకున్న ధనుష్ ఎంతో సంతోషించారు. ఓసారి నా దగ్గరకు వచ్చి.. రజినీకాంత్ సర్‌తో కలిసి నువ్వు యాక్ట్ చేస్తున్నావా అని అడిగారు. అవును అని చెప్పా. దానికి ఆయన ‘ఈ విషయంలో నిన్ను చూసి అసూయపడుతున్నా. ఎందుకంటే నేనింకా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయాను’ అని అన్నారు. ఆ మాటతో రజనీకాంత్‌ను ధనుష్ ఎంతలా ఇష్టపడతారో నాకు అర్థం అయింది’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. రజినీకాంత్ అంటే ధనుష్‌కు ఎంత అభిమానమో చాలా సందర్భాల్లో ధనుష్ సైతం తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed