ఆ పాత్రకు న్యాయం చెయ్యాలి అనకున్న.. అందుకే ఆమెను కలిశా: సాయి పల్లవి

by sudharani |
ఆ పాత్రకు న్యాయం చెయ్యాలి అనకున్న.. అందుకే ఆమెను కలిశా: సాయి పల్లవి
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి డైరెక్షన్‌లో తెరకెక్కతున్న ఈ చిత్రంలో రాహుల్ బోస్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్‌తో కలిసి హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో శివ కార్తికేయన్ ముకుంద్ పాత్ర పోషిస్తుంగా.. ఆయన సతీమణి ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయిపల్లవి నటిస్తుంది. దాదాపు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘అమరన్’ తెలుగు, తమిళంలో దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కాబోతోంది. ఇక విడుదల సమయం దగ్గరపడుతున్న క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్‌గా సాయిపల్లవి పాత్రకు సంబంధించిన బ్యూటిఫుల్ వీడియో షేర్ చేశారు మేకర్స్. ఇందులో నేచురల్ బ్యూటీ యాక్టింగ్ చూసి సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ ఆ రోల్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

‘నేను ఇప్పటి వరకూ బయోపిక్‌లో నటించలేదు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ పాత్రను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా వర్క్ చేశా. భావోద్వేగాలకు పూర్తి న్యాయం చేయాలనకున్నేదాన్ని. ‘అమరన్’ ఆఫర్ వచ్చిన తర్వాత ఈ రోల్‌కు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలనుకున్నా. ముకుంద్ సతీమణి ఇందు రెబెకాను కలిశా. ఆమెతో ఎన్నో విషయాలు గురించి మాట్లాడా. పాత్రకు సంబంధించిన ఎమోషన్స్ గురించి ఓ క్లారిటీ తెచ్చుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed