పవన్ నియోజకవర్గంలో.. ఎన్టీఆర్ బావమరిది 'మూవీ ఈవెంట్'.. ఎప్పుడంటే?

by Geesa Chandu |
పవన్ నియోజకవర్గంలో.. ఎన్టీఆర్ బావమరిది మూవీ ఈవెంట్.. ఎప్పుడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: పిఠాపురం నియోజక వర్గం నుండి పవర్ స్టార్ గెలవడంతో.. ఇప్పుడు అందరి కళ్ళు పిఠాపురం మీదే ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కళ్యాణ్ ఇక్కడి నుండే పోటీ చేయడమే కాదు, రికార్డు మెజారిటీ విజయం చేకూరడంతో పిఠాపురం పేరు తరచుగా వార్తల్లో నిలుస్తుంది. ఇక సినిమా వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి దృష్టంతా పిఠాపురం పైనే ఉంది. మొన్నీమధ్యన నటుడు శర్వానంద్ మూవీ ఈవెంట్ ను ఇక్కడే నిర్వహించాలనుకున్నా కొన్ని కారణాలతో అనుమతులురాక వారి ఆలోచనను విరమించుకున్నారు. అయితే ఇక్కడ ఏ సినిమా ఈవెంట్లు జరగనప్పటికీ.. ఇతర సినిమా ప్రముఖులు వెళ్ళి అక్కడ సందడి చేస్తున్నారు.

అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఒక సినిమా ఈవెంట్ కు మాత్రం ముహూర్తం ఖరారైంది. టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది 'నార్నె నితిన్' కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ఆయ్'. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకున్న ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం.

ఇక ఆయ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను పిఠాపురంలో నిర్వహించనున్నారు. సోమవారం నాడు(ఆగస్టు 05) పిఠాపురంలోని సత్యకృష్ణ కన్వెన్షన్ లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ లాంచ్ ను ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి నార్నె నితిన్ తో పాటు హీరోయిన్, మూవీ టీమ్ అంతా హాజరుకాబోతున్నారు. అలాగే పిఠాపురంలో మొదటిసారి అధికారికంగా సినిమా ఈవెంట్ నిర్వహించనుండడంతో ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ అభిమానులతో పాటూ.. స్థానికులు భారీగా తరలిరావొచ్చనే సమాచారం.



Next Story