- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Mega Hero:వరద బాధితులకు విరాళం ప్రకటించిన మెగా హీరో
దిశ,వెబ్డెస్క్:గత వారం రోజులుగా కురుస్తున్న కొండపోత వర్షాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు(Flood) విలయతాండవం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు, పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇక ఏపీలోని బెజవాడను, తెలంగాణ(Telangana)లోని ఖమ్మం జిల్లాలను వరద నీరు ముంచెత్తింది. ఈ క్రమంలో విజయవాడ(Vijayavada)లో హృదయాన్నే కదిలించే కొన్ని పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వరద బాధితుల కోసం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ పరిస్థితులు పూర్తిగా సర్దుకోలేదు.
ఇది ఇలా ఉండగా తెలుగు చిత్ర పరిశ్రమ(Tollywood) నుంచి నటీనటులు అలాగే మరి కొంతమంది ఇతర సినీ విభాగాలకు చెందిన వారు తమ వంతు సహాయంగా రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందజేస్తున్నారు. అలాగే ఈరోజు(గురువారం) మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 15 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్కు 5 లక్షల చొప్పున, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అనుచరిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ(Panchayati Raj system)కు 5 లక్షల రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది.