తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు మహేష్ బాబు రూ.కోటి విరాళం

by M.Rajitha |
తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు మహేష్ బాబు రూ.కోటి విరాళం
X

దిశ, వెబ్ డెస్క్ : భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు పలువురు టాలీవుడ్ సినీ హీరోలు ముందుకు వస్తున్నారు. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితుల సహాయం నిమిత్తం రూ.కోటి రూపాయల విరళాన్ని ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు, వరద బీభత్సానికి వేలాది మంది ప్రజలు నిరాశ్రయులు అవడం తనను తీవ్రంగా కలచి వేసిందన్న మహేష్ బాబు.. నా వంతు బాధ్యతగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. భగవంతుడి దయ వలన ఈ విపత్కర పరిస్థితి నుండి త్వరగా బయటపడాలని ప్రార్థిస్తున్నాను అని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. కాగా ఇప్పటికే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, సిద్దు జొన్నల గడ్డ, విశ్వక్ సేన్ మొదలగు వారు ముఖ్యమంత్రి సహాయనిధికి తమ వంతు సహకారాన్ని అందించారు.

Next Story

Most Viewed