చిరు-రజినీ మధ్య ఆసక్తికర సంభాషణ.. నేను దండం పెట్టానని పవన్ పిండం పెట్టాడంటున్న చిరు.. ఎవరికి పెట్టారంటే?

by Jakkula Samataha |
చిరు-రజినీ మధ్య ఆసక్తికర సంభాషణ.. నేను దండం పెట్టానని పవన్ పిండం పెట్టాడంటున్న చిరు.. ఎవరికి పెట్టారంటే?
X

దిశ, సినిమా: ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరింది. వైసీపీ ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా ఆ పార్టీ కేవలం నాలుగు సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో ఆ పార్టీపై చాలా మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు(బుధవారం) నాలుగోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో మీమర్స్, తన కొత్త కొత్త మీమ్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నారు.

అయితే, ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే చిరంజీవి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. పవన్ అనే నేను అని మొదలు పెట్టినప్పటి నుంచి ప్రమాణ స్వీకారం అయిపోయే వరకు చిరు తన తమ్ముడినే ఆనందంగా చూస్తూ ఉండిపోయారు. అయితే ఆయన మధ్యలో రజినీకాంత్‌తో సంభాషించారు. ప్రస్తుతం దీనిని కొందరు మీమర్స్.. అన్నయ్య మూవీ డైలాగ్‌తో మీమ్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇవి తెగ ట్రెండ్ అవుతున్నాయి.

అందులో చిరు, రజినీతో మాట్లాడుతూ.. ‘‘నేను నేను ఒకడికి దండం పెట్టాను అని మావాడు ఫీల్ అయ్యాడు.. వాడికి ఏకంగా పిండం పెట్టేసాడు తలైవా’’.. అంటూ చెప్తున్నట్లు ఓ మీమ్ వైరల్ అవుతుంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇది చూసిన కొందరు జగన్‌ను విమర్శిస్తూనే ఈ పోస్ట్ చేసి ఉంటారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ మీమ్స్ అందరి నోట నవ్వులు పూయిస్తున్నాయి.





Advertisement

Next Story

Most Viewed