కుక్కల కోసం రూ. 45 కోట్లు ఖర్చు చేసిన బాలీవుడ్ హీరో.. ఇప్పుడేమో..

by Javid Pasha |
కుక్కల కోసం రూ. 45 కోట్లు ఖర్చు చేసిన బాలీవుడ్ హీరో.. ఇప్పుడేమో..
X

దిశ, సినిమా : జంతు ప్రేమికులు కుక్కల్ని ఇష్టంగా పెంచుకుంటారు?.. వాటికి అవసరమైన పోషకాహారం పెడతారు. సమయం దొరికినప్పుడల్లా సరదాగా ఆడుకుంటారు. వాకింగ్‌కు తీసుకెళ్తారు. కానీ ఓ బాలీవుడ్ హీరో అందరూ ఆశ్చర్యపోయే పనిచేశాడు. తాను పెంచుకుంటున్న కుక్కల పేరిట కోట్లాది రూపాయల ఆస్తిని రాసిచ్చాడు. ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన ఆ నటుడు ఇప్పుడు రాజకీయాల్లోనూ రాణిస్తున్నాడు. ఇంతకీ ఎవరా డాగ్ లవర్ అనుకుంటున్నారా? అతనే బాలీవుడ్ సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి.

ఎవరిదగ్గరైనా ఒకటో, రెండో కుక్కల్ని పెంచుకుంటారు. మహా అయితే పదింటిని పెంచుకుంటారు. కానీ బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి మాత్రం ఏకంగా 116 కుక్కల్ని పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం ముంబై సమీపంలోని మడ్ ఐలాండ్‌లో గల తన 1.5 ఎకరాల స్థలంలో వాటిని పోషిస్తున్న మిథున్ తనతోపాటు వాటికి లగ్జరీ లైఫ్ మజా చూపిస్తున్నాడు. సాధారణ ఇల్లు అయితే వాటికి కంఫర్ట్‌గా ఉండదని కోట్లాది రూపాయల విలువైన విలాసవంతమైన భవంతిని రిజర్వ్ చేశాడట. ఇందులో ఆయన పర్సనల్ హోమ్ కూడా ఉండగా, కుక్కలకోసమే కేవలం రూ. 45 కోట్ల ఆస్తని కేటాయించాడట మిథున్. అంతేకాకుండా తన ఫ్రెండ్ పెంచుకుంటున్న పెట్ గాగ్స్ కోసం కూడా అన్ని మోడర్న్ ఫెసిలిటీస్ సమాకూర్చినట్లు తెలుస్తోంది. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా సినీ అవర్స్, బాలీవుడ్ అభిమానులు ది గ్రేట్ డాగ్ అవర్ అంటూ మిథున్ చక్రవర్తిని తెగ పొగిడేస్తున్నారు.

సినిమాల విషయానికి వస్తే మిథున్ చక్రవర్తి హీందీతోపాటు తెలుగులో కూడా కొన్ని మూవీస్ చేశాడు. పవన్ కళ్యాణ్, వెంటకేష్ నటించిన గోపాల గోపాల చిత్రంలో విలన్ రోల్ పోషించాడు. ఆ తర్వాత కూడా వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోయాడు. యోగితా బాలిని పెళ్లి చేసుకున్న మిథున్ చక్రవర్తికి నలుగురు పిల్లలు ఉండగా.. ఎవరో చెత్త కుండీలో పడేసిన ఓ చిన్నారిని కూడా దత్తత తీసుకొని పెంచి పెద్ద చేశాడు. నటనా పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ సౌమ్యుడిగా, వివాద రహితుడిగా మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు మిథున్ చక్రవర్తి.

Advertisement

Next Story