వరద బాధితులకు విరాళాల వెల్లువ.. మైత్రి మూవీ మేకర్స్ భారీ సాయం!

by Geesa Chandu |
వరద బాధితులకు విరాళాల వెల్లువ.. మైత్రి మూవీ మేకర్స్ భారీ సాయం!
X

దిశ, వెబ్ డెస్క్: వరద బాధితులకు అండగా నిలిచేందుకు.. తెలుగు రాష్ట్రాలలో విరాళాల వెల్లువ కొనసాగుతుంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, సినీప్రముఖులు, ఇంకా పలు సంస్థలు బాధితులకు విరాళాలు ప్రకటించి అండగా నిలవగా.. ఇప్పుడు మరొక సంస్థ ముందుకొచ్చింది. టాలీవుడ్ కి చెందిన ప్రముఖ సినీ బ్యానర్ అయిన.. మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) తెలుగు రాష్ట్రాలలోని వరద బాధితుల(Flood victims) సహాయార్ధం రూ. 50 లక్షల విరాళాన్ని ప్రకటించింది.

ఈ విపత్కర పరిస్థితులలో.. ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలకు తమ వంతు కృషిగా ఈ సహాయాన్ని చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సహాయనిధులకు చెరో రూ.25 లక్షలను విరాళంగా ఇస్తున్నామని తెలిపింది. కాగా రెండు తెలుగు రాష్ట్రాలలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు వరద నీటిలో తడుస్తూ తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది.ఈ ఆపద సమయంలోనే తమ వంతు చిన్న సహాయంగా ఈ విరాళాన్ని ఇస్తున్నామని, బాధిత కుటుంబాలు త్వరగా కోలుకొని, ఎప్పటిలానే సాధారణ స్థితికి రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ X ద్వారా ట్వీట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed