జాన్వీ, ఖుషీ కాకుండా శ్రీదేవికి మూడో కూతురు ఉందా..? ఎట్టకేలకు బయటపడ్డ సంచలన నిజాలు!

by Kavitha |
జాన్వీ, ఖుషీ కాకుండా శ్రీదేవికి మూడో కూతురు ఉందా..? ఎట్టకేలకు బయటపడ్డ సంచలన నిజాలు!
X

దిశ, సినిమా: దివంగత నటి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇక దివంగత శ్రీదేవి, బోనీ కపూర్‌ జంటకు ఇద్దరు కూతుర్లు జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌ ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయం. వీరిద్దరే కాకుండా శ్రీదేవికి మరో కుమార్తె కూడా ఉందని మీకు తెలుసా?.. అసలు ఈ మూడో కూతురు ఎవరు..? శ్రీదేవి జీవితంలోకి ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీదేవి నటించిన చివరి మూవీ ‘మామ్’ అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా, మూవీలో తన కూతురుగా నటించిన సజల్ అలీ గురించి శ్రీదేవి కొన్ని విషయాలు చెప్పింది. మూవీ షూటింగ్ సమయంలో ఆమెతో ఏర్పడిన బాండింగ్ గురించి మాట్లాడుతూ.. సజల్ తల్లి ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కలచివేసిందని.. సజల్ నాకు మూడో సంతానం లాంటిదని, ఇప్పుడు నాకు మరో కూతురు ఉన్నట్లు భావిస్తున్నానని శ్రీదేవి ఆ సమయంలో చెప్పింది.


ఇక శ్రీదేవి మరణానంతరం సజల్ అలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శ్రీదేవి గారు నాకు తల్లి లాంటిది. ప్రస్తుతం నేను షాక్‌లో ఉన్నాను. మళ్లీ నా తల్లిని కోల్పోయినట్లు అనిపిస్తుందని చెప్పింది సజల్. నేను దుబాయ్‌లో జరిగిన ‘మసాలా’ అవార్డ్‌ ఫంక్షన్‌కు హాజరు కాలేకపోయిన.. ఆ సమయంలో శ్రీదేవి, ‘ఐ మిస్డ్‌ యూ బేటా’ అని టెక్ట్స్‌ మెసేజ్‌ పంపిందని సజల్ గుర్తు చేసుకుంది. ఆమె నుంచి నాకు వచ్చిన చివరి మెసేజ్‌ అదే. గత రెండు నెలల్లో మేము చాలా సార్లు మాట్లాడుకున్నాం. కొన్ని రోజుల క్రితం ఆమె నాకు ఫోన్ చేసింది. కానీ అప్పుడు నేను షూటింగ్‌లో ఉండి కాల్ మిస్ అయ్యాను. నేను ఆమెకు తిరిగి కాల్ చేయాలని అనుకుంటూనే ఉన్నాను, కానీ చాలా సమయం తీసుకున్నాను, అప్పటికే చాలా లేట్ అయిపోయింది అని సజల్‌ శ్రీదేవి మృతిపై విచారం వ్యక్తం చేసింది.




Advertisement

Next Story

Most Viewed