తారక్ భార్య లక్ష్మీ ప్రణతికి కోపం వస్తే ఏం చేస్తుందో తెలుసా?

by Jakkula Samataha |
తారక్ భార్య లక్ష్మీ ప్రణతికి కోపం వస్తే ఏం చేస్తుందో తెలుసా?
X

దిశ, సినిమా : జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈమె ఎంతో పద్ధతిగా ఉంటుంది. ఎక్కువగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండదు. తన పిల్లలు, ఫ్యామిలీని చూసుకుంటూ గడిపేస్తుంది. అయితే ఈ అమ్మడుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అది ఏమిటంటే? ఏ వ్యక్తికైనా సరే కోపం రావడం అనేది సహజం. అలానే తారక్ భార్య లక్ష్మీ ప్రణతికి కూడా అప్పుడప్పుడు కోపం వస్తుందంట. తారక్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో వీరు గొడవలు పడ్డారంట. అయితే ఆసమయంలో లక్ష్మీ తనకు కోపం వస్తే , డైరెక్ట్‌గా టీవీ వద్దకు వెళ్లి, ఆది సినిమాను చూస్తదంట. దీంతో ఆమె కోపం తగ్గిపోతుందంట. అయితే ఎందుకంటే? తారక్ కెరియర్‌ను మలుపు తిప్పిన సినిమా అంటే ఆది. ఆ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. అందులో ఆయన ప్రేమ, కోపం, ఆవేశం అన్నీ ఉంటాయి. అందుకే లక్ష్మీప్రణతికి ఈ సినిమా అంటే చాలా ఇష్టం అంట. కోపం వచ్చినా, సంతోషంగా అనిపించినా ఎప్పుడు ఆ సినిమానే చూస్తూ ఉంటుంది అంట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇది చూసిన కొందరు, కోపం వస్తే ఆది సినిమా చూడటం ఏంటీ అని స్మైల్ ఇమోజీస్ పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed