Chiranjeevi ‘Bhola Shankar’ చిత్రబృందానికి కోర్టు గుడ్ న్యూస్

by Anjali |
Chiranjeevi ‘Bhola Shankar’ చిత్రబృందానికి కోర్టు గుడ్ న్యూస్
X

వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన భోళా శంకర్ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మెహెర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటించగా.. కీర్తి సురేశ్ కీలక పాత్ర పోషించింది. ఇదిలా ఉండగా.. డిస్ట్రిబూటర్‌ సత్యనారాయణ ఈ సినిమాపై సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఏపీలో రేపు యథాతథంగా సినిమా విడుదల కానుంది. వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకల్లో చేసిన కామెంట్లు వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. 'పిచ్చుకపై బ్రహ్మాస్త్రం' అంటూ మెగాస్టార్‌ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారమే రేపాయి. ఈ కామెంట్లకు ఏపీ మంత్రులంతా మూకుమ్మడిగా చిరంజీవిపై విమర్శల దాడి చేశారు.

ఇవి కూడా చదవండి : కాళ్లకు మెట్టెలతో కనిపించిన Samantha..

Next Story

Most Viewed