కష్టమైన టాస్కులు ఆడుతూ అడవిలోనే ఉంటూ దొరికింది తినాలి.. బిగ్‌బాస్ కంటే దారుణమైన షో.. పాల్గొంటోన్న హీరోయిన్

by Anjali |
కష్టమైన టాస్కులు ఆడుతూ అడవిలోనే ఉంటూ దొరికింది తినాలి.. బిగ్‌బాస్ కంటే దారుణమైన షో.. పాల్గొంటోన్న హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: నటి తేజస్వి మదివాడ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచమైంది. తర్వాత తెలుగు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఐస్‌క్రీం సినిమాలో కథానాయికగా నటించింది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, మనం, హార్ట్ అటాక్, లవర్స్, అనుక్షణం, పండగ చేస్కో, మళ్ళీ మళ్ళీ రాని రోజు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, కేరింత, శ్రీమంతుడు, నట్పదిగారం, జతకలిసే, సూపర్ స్టార్ కిడ్నాప్, విష్ యూ హ్యాపీ బ్రేకప్, ఊర్వశివో రాక్షసివో, రోజులు మారాయి, మిస్టర్, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్, మన ముగ్గురి లవ్‌స్టోరి, బాబు బాగా బిజి, కమిట్‌మెంట్ వంటి చిత్రాల్లో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.

ఈ బ్యూటీ బాలీవుడ్‌లోని ‘రియాలిటీ రాణీస్ ఆఫ్ ది జంగిల్’ అనే షోలో పాల్గొంటుంది. సోమవారం, మంగళవారం మాత్రమే డిస్కవరీ ఇండియా ఛానల్ లో రాత్రి 10 గంటలకు వచ్చే ఈ షో బిగ్‌బాస్ కంటే చాలా దారుణంగా ఉంటుందని అంటున్నారు. మొత్తం ఈ షో లేడీ కంటెస్టెంట్లతోనే ఉంటుందట. 12 మంది లేడీ కంటెస్టెంట్లను అడవిలోకి పంపించి.. కఠినమైన టాస్కులు ఇస్తారట. పైగా ఫారెస్ట్‌లో దొరికే ఆహారం తింటూ ఉండాలి. బిగ్‌బాస్‌లాగే ‘రియాలిటీ రాణీస్ ఆఫ్ ది జంగిల్’ షోలో కూడా ఎలిమినేషన్స్ ఉంటాయి. విజయవంతంగా అన్ని టాస్కులు కంప్లీట్ చేసిన వారికి జంగిల్ రాణి టైటిల్ దక్కుతుంది.

Next Story

Most Viewed