యానిమేటెడ్ సిరీస్‌గా ‘బాహుబలి’.. ట్రైలర్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

by Disha Web Desk 7 |
యానిమేటెడ్ సిరీస్‌గా ‘బాహుబలి’.. ట్రైలర్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
X

దిశ, సినిమా: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘బాహుబలి’ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, అనుష్క శెట్టి, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం రికార్డులు బద్దలు కొట్టి.. కొత్త రికార్డులను సృష్టించింది. అంతే కాకుండా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి.. భారీ వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఈ మూవీ యానిమేటెడ్ రూపంలో వచ్చేందుకు సిద్ధం అయింది.

ఈ విషయాన్ని నేరుగా దర్శకుడు రాజమౌళి అనౌన్స్ చేశాడు. అంతే కాకుండా.. ఈ యానిమేటెడ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ పేరుతో రానున్న ఈ యానిమేటెడ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ తాజాగా విడుద‌ల చేశారు. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా మే 17 నుంచి ఇది అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Read More..

మహేష్ బాబు - రాజమౌళి సినిమాలో ఆ హీరోయిన్స్ కూడానా..? అయ్య బాబోయ్ ఈ ట్వీస్ట్ మాములుగా లేదుగా

Next Story

Most Viewed