ప్రేక్షకులు ఆ రోజు కోసం సిద్ధంగా ఉండండి.. ‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

by sudharani |
ప్రేక్షకులు ఆ రోజు కోసం సిద్ధంగా ఉండండి.. ‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీతో బిజీగా ఉన్నారు. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో స్టార్ హీరోయిన్ త్రిష కథనాయికగా నటిస్తుంది. UV క్రియేషన్స్‌పై విక్రమ్, ప్రమోద్, వంశీ నిర్మిస్తోన్న ఈ సినిమా 2025లో జనవరిలో రానున్నట్లు తెలిసిన విషయమే. కానీ డేట్ మాత్రం అనౌన్స్‌చెయ్యలేదు. అయితే.. ఈ చిత్రం రిలీజ్‌పై తాజాగా అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ మేరకు ‘ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అంతే కాకుండా.. డబ్బింగ్ పనులు కూడా ఈరోజు నుంచే ప్రారంభం అవుతున్నాయి. ఇక ప్రేక్షకులు, ఫ్యాన్స్ అందరూ జనవరి 10న అద్భుతమైన అనుభూతిని పొందడానికి సిద్ధంగా ఉండాలి’ అంటూ చెప్పుకొచ్చారు మూవీ నిర్మాణ సంస్థ. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో.. మెగా ఫ్యాన్స్ పండుగా చేసుకుంటున్నారు.

Next Story

Most Viewed