Bigg Boss Telugu 7: శివాజీ దెబ్బకి దండం పెట్టేసిన అమర్ దీప్.. ఎందుకంటే..?

by Prasanna |
Bigg Boss Telugu 7:  శివాజీ దెబ్బకి దండం పెట్టేసిన అమర్ దీప్.. ఎందుకంటే..?
X

దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ 7 ఐదోవారం నామినేషన్స్ హీట్ ఒక రేంజులో ఉంది. రతికిని ఉదాహరణగా తీసుకుంటూ బిగ్ బాస్ హౌస్ నుంచి పంపడం ద్వారా ఇంట్లో ఉన్న వాళ్లకి కొన్ని సంకేతాలను బిగ్ బాస్ పంపించారు. ఆట ఆడకుండా.. పక్కన వాళ్లతో ముచ్చట్లు వేసుకుంటూ కూర్చుంటే ఎవరికైనా ఇదే పరిస్థితి వస్తుందని, అలాగే ఇంటి నుంచి పంపడం ఖాయం అని చెప్పకనే చెప్పేశారు. దీంతో ఇంట్లో ఉన్న వారిలో కొత్త టెన్షన్ మొదలైంది. ఇక ఐదో వారం నామినేషన్స్ మొదలవ్వడంతో ఇంటి సభ్యుల మధ్య మరోసారి వార్ మొదలైంది.

శివాజీ వర్సెస్ అమర్ దీప్‌ల మధ్య సీరియస్ డిస్కషన్ నడిచింది. వీరిద్దరూ ఒకర్నొకరు నామినేట్ చేసుకున్నారు. ‘నేను ఒకరి వైపే ఉంటే.. ప్రియాంకకి కాయిన్స్ ఇవ్వను కదా’? అని శివాజీ అంటే.. ‘మరి.. యావర్, ప్రశాంత్‌లకు కూడా కాయిన్స్ ఇచ్చారు కదా.. వాళ్లకే ఎక్కువ ఎందుకిచ్చారంటూ అని అమర్ దీప్ అడిగాడు. ‘వాళ్లకి అన్యాయం జరిగింది కాబట్టి కాయిన్స్ ఇచ్చాను అని చెప్పాడు శివాజీ. ఇక vడాక్టర్ బాబు, ప్రియాంకలు కూడా శివాజీని టార్గెట్ చేసి నామినేట్ చేశారు. ఇక మరోసారి యావర్‌ని తిండి కోసం ఏడుస్తూ నామినేట్ చేసింది ప్రియాంక. దీంతో యావర్.. ఇది సిల్లీ నామినేషన్ అని వాదించాడు యావర్.

Advertisement

Next Story

Most Viewed