ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన అక్కినేని ఫ్యామిలీ.. పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల రియాక్షన్ ఇదే!

by Hamsa |   ( Updated:2024-05-12 14:56:17.0  )
ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన అక్కినేని ఫ్యామిలీ.. పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల రియాక్షన్ ఇదే!
X

దిశ, సినిమా: అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని మంచి సినిమాలు చేస్తున్నారు. అక్కినేని నాగేశ్వర రావు నుంచి మొదలుకుని అఖిల్ వరకు ప్రేక్షకుల్లో ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే నాగార్జున, అఖిల్, నాగచైతన్య, సుమంత్, సుశాంత్ పలు సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఎన్నికలకు పోలింగ్ దగ్గర పడుతుండటంతో షూటింగ్‌లకు బ్రేక్ పడింది.

దీంతో అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఒకే చోట చేరారు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రోజు ఆదివారం రేపు పోలింగ్ కావడంతో అక్కినేని వారసులంతా ఒకే చోట చేరి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫొటోను యంగ్ హీరో సుశాంత్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. ‘‘కజిన్స్ కనెక్ట్’’ అనే క్యాప్షన్ జత చేశాడు. ఇందులో నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్, సుప్రియ మరికొందరు ఉన్నారు.

అయితే ఈ ఫొటోను చూసిన అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం ఒకే చోట ఉండటం చాలా అరుదుగా జరుగుతుంది. ఎన్నికల వేళ అక్కినేని ఫ్యామిలీ ఒకే చోట ఉండటంతో ఊహించని ట్విస్ట్ అని కొందరు అంటున్నారు. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ నేడు ఆదివారం కావడంతో అంతా ఒకే చోట కలిసి ఎంజాయ్ చేయడానికి సమయం కేటాయించినట్లు తెలుస్తోంది.

Read More...

రేపు చిరంజీవి, రామ్ చరణ్, NTR, మహేష్ బాబు ఓటు వేసేది ఇక్కడే!

Advertisement

Next Story

Most Viewed