Puri Jagannadh: లైగర్ ఫ్లాప్ అయ్యాక రాజమౌళి ఫాదర్ నాకు కాల్ చేసారు.. చాలా ఎమోషనల్ అయ్యా

by Prasanna |
Puri Jagannadh: లైగర్ ఫ్లాప్ అయ్యాక రాజమౌళి ఫాదర్ నాకు కాల్ చేసారు.. చాలా ఎమోషనల్ అయ్యా
X

దిశ, సినిమా : ఇప్పుడున్న తెలుగు స్టార్ డైరెక్టర్స్ లో పూరి జగన్నాధ్ స్టైలే వేరు. విజయ్ దేవరకొండ లైగర్ హిట్ అయితే పూరీ లైఫ్ మొత్తం మారిపోయేది. కానీ, ఎవరు ఊహించని విధంగా బిగెస్ట్ ఫ్లాప్ గా మిగిలింది. ఆ తర్వాత చాలా ట్రోల్స్ వచ్చాయి. పూరి పై ఘాటు విమర్శలు కూడా చేసారు. తాజాగా, హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలోనే డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూరి జగన్నాధ్ మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్ అయ్యారు. లైగర్ ఫ్లాప్ అయ్యాక చాలా బాధ పడ్డాను.. ఆ సమయంలో రాజమౌళి ఫాదర్ ఫోన్ చేసారు. ఆయన కాల్ చూసిన వెంటనే ఇంత గొప్ప వ్యక్తి నాకెందుకు ఫోన్ చేస్తున్నారని ముందు షాక్ అయ్యాను. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాను. తర్వాత మూవీ ఏం చేస్తున్నారని అడిగారు.. ఇంకా ఏ లైను అనుకోలేదు సార్ అని అన్నాను. సరే సినిమా స్టోరీ అనుకున్నాక నాకు చెప్పండి. నా వల్ల అయినా సహాయం చేస్తా అంటూ చెప్పారు. ఆ మాటలకు చాలా ఎమోషనల్ అయ్యా.. ఇక అదే గుర్తు ఇప్పటి మంచి సినిమా మాత్రమే తీయాలని డిసైడ్ అయ్యా అంటూ ఆయన మాటల్లో అ తెలిపారు. దీంతో పూరి జగన్నాధ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read More..

Double iSmart : తెలంగాణ పోలీస్ అకాడమీలో ‘డబుల్ ఇస్మార్ట్’ ముచ్చట్లు..!

Advertisement

Next Story

Most Viewed