క్యూరియాసిటీ పెంచేస్తున్న అడివి శేష్.. 2025 మూడు అంటూ ఆసక్తికర ట్వీట్

by Hamsa |
క్యూరియాసిటీ పెంచేస్తున్న అడివి శేష్.. 2025 మూడు అంటూ ఆసక్తికర ట్వీట్
X

దిశ, సినిమా: కంటెంట్‌ను నమ్మి సినిమాలు చేస్తున్న హీరోల్లో అడివిశేష్ కూడా ఒకరు. ఈ యంగ్ హీరో పలు సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కంచుకున్నాడు. ఇండియావైడ్‌గా కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉందనడంలో అతిశయోక్తి లేదు. ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. గూఢచారి సీక్వెల్‌ జీ-2తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనిని విజయ్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. అయితే అడివి శేష్ ‘డెకాయిట్’ లో చేస్తున్నాడు.

ఇందులో స్టార్ హీరో కూతురు శృతి హాసన్ నటిస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, అడివిశేష్ ఓ ట్వీట్‌తో క్యూరియాసిటీని పెంచేశాడు. 2025 మూడు సినిమాలు రిలీజ్ అవుతాయని క్యాప్షన్ జత చేశాడు. కానీ మూడవ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తున్నాడనేది మాత్రం తెలపలేదు. ఈ క్రమంలో.. అడివి శేష్ నాని నటిస్తున్న హిట్-3లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే చర్చ మొదలైంది. ఇక ఈ సంగతి తెలుసుకున్న అభిమానులు ఆనందపడుతున్నారు.

Next Story