ఊహించిన దానికంటే రెట్టింపు సంతోషంగా ఉంది.. నటి కామెంట్స్ వైరల్

by sudharani |
ఊహించిన దానికంటే రెట్టింపు సంతోషంగా ఉంది.. నటి కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో, అమీర్ ఖాన్ నిర్మించిన చిత్రం ‘లాపతా లేడీస్’. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభా రత్న తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా 2025 ఆస్కార్‌కు భారత్ నుంచి ఎంపికైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఓ పోస్ట్ పెట్టింది. ఈ అరుదైన ఘనతపై ‘లాపతా లేడీస్’లో ప్రధాన పాత్ర పుష్పరాణిగా నటించిన ప్రతిభా రత్న స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

‘మా చిత్రం ‘లాపతా లేడీస్’ ఆస్కార్‌ 2024 బరిలో చేరడం చాలా ఆనందంగా ఉంది. నాకు అసలు మాటలు రావడం లేదు. ఈ సినిమా ఆస్కార్‌కు మన దేశం నుంచి సెలెక్ట్ కావాలని ఎంతో కోరుకున్నాం. ఫైనల్‌గా మా ఆశలు నిజమయ్యాయి. మా కష్టానికి ఫలితం దక్కింది. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తూపోతే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ప్రస్తుతం నా విషయంలో ఇదే జరుగుతోంది. నేను ఊహించిన దాని కంటే రెట్టింపు సంతోషంగా ఉంది. కిరణ్‌రావు, ఆమిర్‌ఖాన్‌లను ఎప్పుడెప్పుడు కలుస్తానా అని చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.

కాగా.. 2001 కాలపు నాటి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’.. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైన సంఘటన ఆధారంగా రూపొందించారు. ఇటీవల విడుదలైన ‘లాపతా లేడీస్’ మూవీ సూపర్ సక్సెస్ అందుకోవడంతో పాటు.. ప్రతిష్టాత్మక టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో లాస్ట్ ఇయర్ ప్రదర్శించడం విశేషం. అంతే కాకుండా మార్చి 1న విడుద‌లైన ‘లాపతా లేడీస్‌’ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని అందుకోవడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రూ.27 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అలాగే ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక అవార్డ్స్‌ను సొంతం చేసుకుంది.

Next Story

Most Viewed