క్యాన్సర్‌ బారిన పడ్డ బుల్లితెర నటి.. థర్డ్‌ స్టేజ్‌ అంటూ పోస్ట్‌

by Kavitha |
క్యాన్సర్‌ బారిన పడ్డ బుల్లితెర నటి.. థర్డ్‌ స్టేజ్‌ అంటూ పోస్ట్‌
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు హిందీలో సూపర్‌ హిట్టు అయిన 'హే రిస్తా క్యా ఖేల్తా హై' తెలుగు డబ్బింగ్‌ వర్షన్‌ ‘పెళ్లంటే నూరేళ్ల పంట’ పేరుతో వచ్చిన సీరియల్‌ ద్వారా పరిచయం అయ్యింది. అయితే ఈ సీరియల్‌ మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీకి హిందీలో అవకాశాలు పెరిగాయి. ‘నాగిన్‌ సీజన్‌ 5’ లో నటించింది. సినిమాలతో పాటు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌లో కూడా యాక్ట్‌ చేస్తూ ఉంటుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సీరియల్ నటిగా కొనసాగుతున్న టైంలోనే ప్రొడ్యూసర్ రాకీ జైశ్వాల్‌ని ప్రేమించి అతడిని 2014లో పెళ్లి చేసుకుంది. ఇలా కెరీర్‌లో దూసుకుపోతున్న హీనా ఖాన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది.

పోస్ట్‌లో భాగంగా.. హాయ్ అందరికీ గత కొంత కాలం నుంచి నేను ఒక రూమర్ గురించి వింటున్నాను. ఈ క్రమంలో మీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి పంచుకోవాలనుకుంటున్నాను. నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలియాలి. నాకు బ్రెస్ట్ క్యాన్సర్.. మూడో స్టేజ్‌లో ఉంది. ఇప్పటికే ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న.. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుంటానని ఎంతో ధైర్యంగా, నమ్మకంగా ఉన్నాను. ఈ మహమ్మారి నుంచి కోలుకోవడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధం. ఈ సమయంలో నాకు కాస్త ప్రైవసీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను'' అని చెప్పుకొచ్చింది. ఇక హీనా ఖాన్‌కు క్యాన్సర్‌ అని తెలియడంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed