బేబి మూవీ వెనుక పెద్ద స్కామ్.. డైరెక్టర్ ఆ కథను దొంగిలించాడా?

by Javid Pasha |
బేబి మూవీ వెనుక పెద్ద స్కామ్.. డైరెక్టర్ ఆ కథను దొంగిలించాడా?
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ వైష్ణవీ చైతన్య, ఆనంద్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా, సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ బేబి. గతేడాది రిలీజైన చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చిన్న సినిమాల జాబితాలో విడుదలైనప్పటికీ పెద్ద పెద్ద చిత్రాలను తలదన్నేలా ఇండస్ట్రీనే షేక్ చేసి బంపర్ హిట్ అందుకుంది. కాగా బేబి మూవీ రిలీజైన కొంతకాలానికి ఆ స్టోరీకి సంబంధించిన పలు వివాదాలు చెలరేగాయి. వర్తమాన దర్శకుడు రిషిన్ శ్రీరామ్ బేబి కథ తనదేనని, డైరెక్టర్ సాయి రాజేష్ దొంగిలించాడని ఆరోపించాడు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా బయట పెట్టాడు. అంతేకాకుండా ‘బేబి లీక్స్’ అనే బ్లాగ్‌ను క్రియేట్ చేసి తన వద్దగల ఆధారాలను వివరంగా పొందుపర్చాడు రిషిన్.

అయితే ఈ వివాదంలో తాజాగా ప్రముఖ నటి గాయత్రీ గుప్తా కూడా రిషిన్‌కి సపోర్టుగా నిలిచింది. ‘‘సాయి రిషన్ 2015లో తమిళనాడులో జరిగిన ఒక సంఘటన ఆధారంగా కథ రాశాడు. ఓ బస్తీ యువతి ఇద్దరు కుర్రాళ్లను మోసం చేసింది. దీంతో ఆమెను వాళ్లిద్దరూ చంపేశారు. ఆ వార్త అప్పట్లో మీడియాలో కూడా వచ్చింది. దీని ఆధారంగా రిషిన్ కథ రాశాడు. అది సాయి రాజేష్‌కు కూడా చెప్పాడు. దానిని సినిమా తీస్తానని కూడా వివరించాడు. కానీ ఆ తర్వాత రిషిన్ సినిమా తీయలేదు. కట్ చేస్తే సాయి రాజేష్ బేబి సినిమాను తీశాడు. కానీ ఇది రియల్‌గా రిషిన్ రాసుకున్న ‘ప్రేమించొద్దు’ కథ. దీనిని సాయి రాజేష్ దొంగింలించాడు. దీని వెనుక పెద్ద స్కామ్ జరిగింది’’ అంటూ ఆరోపించింది గాయత్రీ గుప్త. ప్రజెంట్ ఆమె మాటలు నెట్టింట వైరల్ అవుతుండగా, కథ ఎవరు రాశారో వారికి న్యాయం జరగాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed