సుష్మా జీ అకాల మరణం ఎంతో బాధించింది : మోడీ

by Anukaran |
సుష్మా జీ అకాల మరణం ఎంతో బాధించింది : మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ లీడర్ సుష్మా స్వరాజ్ అకాల మరణం తనను ఎంతో బాధించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ రోజు ఆమె మొదటి పుణ్య తిథిని జ్ఞాపకం చేసుకంటున్నట్లు ప్రధాని గుర్తు చేశారు.

సుష్మాజీ ఇక లేరనే విషయం తననే కాదు.. చాలా మందిని బాధించినదని తెలిపారు. ఆమె తన జీవితంలో నిస్వార్ధంగా దేశానికి సేవ చేసిందని.. ప్రపంచ వేదికలపై భారత్‌కు ఒక స్వరంలా నిలిచిందని మోడీ ట్విట్టర్ మాద్యమంగా వెల్లడించారు. ఇదిలాఉండగా, గతేడాది ఆగష్టు 6న అనారోగ్య సమస్యలతో సుష్మాస్వరాజ్ మరణించిన విషయం అందరికీ తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed