అంతర్జాతీయ వేదికపై మోడీ ప్రసంగం

by Shamantha N |
అంతర్జాతీయ వేదికపై మోడీ ప్రసంగం
X

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ విశ్వవేదికపై గురువారం ఆన్‌లైన్‌లో ప్రసంగించనున్నారు. యూకేలో మూడు రోజులు ఈనెల 9 నుంచి 11వ తేదీల మధ్యలో ఇండియన్ గ్లోబల్ వీక్ 2020 నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని భారత వాణిజ్యం, విదేశీ పెట్టుబడులపై దృష్టి సారించనున్నట్టు సమాచారం. భారతదేశ ప్రపంచీకరణపై ఇదే అతిపెద్ద అంతర్జాతీయ సదస్సుగా పేర్కొంటున్నారు. బీ ద రివైవల్ థీమ్‌తో సాగనున్న ఈ కార్యక్రమంలో సుమారు ఐదువేల మంది పాల్గొనే అవకాశమున్నదని నిర్వాహకులు తెలిపారు. ప్రధాని మోడీతోపాటు కేంద్రమంత్రులు ఎస్ జైశంకర్, పియూష్ గోయల్, హర్షదీప్ సింగ్ పూరి, రవిశంకర్ ప్రసాద్, మహేంద్రనాథ్ పాండేలూ మాట్లాడనున్నారు. బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ ప్రత్యేక ప్రసంగాన్ని ఇవ్వనున్నట్టు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed