- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ కారణంగా బెంగళూరులోని ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి ఇంటిని తగలబెట్టారు ఆందోళనకారులు. ఈ ఘటనపై ఆయన స్పందించారు. ‘‘ నా ఇంటిపై దాడి నన్నెంతో బాధిస్తుంది. నేను చేసిన తప్పు ఏందీ? నేను ఏం పాపం చేశాను? నేను తప్పు చేస్తే.. పోలీసులకో లేక మీడియాకో చెప్పాలి. అంతేకానీ నా ఇంటిపై దాడి చేస్తారా? ఈ దాడి నన్ను ఎంతో బాధించింది. నా అల్లుడా.. కొడుకా.. లేక ఇంకొకరా.. ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు శిక్షిస్తారు. నేను ఏం తప్పు చేయకున్నా.. నా ఇంటిని పూర్తిగా కాల్చేశారు. ఏమీ మిగల్లేదు. బూడిద మిగిలింది’’ అని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
తన ఇంటిపై దాడి జరిగిన సమయంలో తన కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేరని ఎమ్మెల్యే వెల్లడించారు. నియోజకర్గంలో అందరికీ అందుబాటులో ఉంటున్నా.. తన ఇంటిపై దాడి చేయడం తీవ్రంగా బాధించిందని.. అయినా తన నియోజకవర్గ ప్రజలందరూ తనకు అక్కా చెల్లెల్లు.. అన్నాదమ్ములని ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి అన్నారు.