వలస కూలీలు స్వస్థలాలకు తరలింపు

by Shyam |
వలస కూలీలు స్వస్థలాలకు తరలింపు
X

దిశ, నల్గొండ: కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు వలస కూలీలను స్వస్థలాలకు తరలిస్తున్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​ వద్ద ఏర్పాటు చేసిన క్వారంటైన్​ కేంద్రంలో ఉన్న 150 మంది వలస కూలీలను అధికారులు వారి వారి సొంతూళ్లకు తరలించారు. ఆరోగ్య పరీక్షలు చేసి, చేతికి ముద్రలు వేశారు. వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు వచ్చిన వలస కూలీలను లాక్​డౌన్​ కారణంగా అంతరాష్ట్ర చెక్​పోస్టు వద్ద క్వారంటైన్​లో ఉంచారు. ఇందులో ప్రకాశం జిల్లాకు చెందిన 98 మంది, గుంటూరుకు చెందిన 48 మంది, కడప జిల్లా వాసులు నలుగురు, నెల్లూరు జిల్లా వాసులు ఇద్దరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Tags: Migrant workers, move, their hometown, nagarjuna sagar

Advertisement

Next Story