అందువల్లే పార్టీలో చేరుతున్నారు..

by Shyam |
అందువల్లే పార్టీలో చేరుతున్నారు..
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నుండి పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

మంత్రి సమక్షంలో గోషామహల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను చేపట్టారని అన్నారు. రాష్ట్రంలో ఎప్పడు , ఏ ఎన్నికలొచ్చినా ప్రతిపక్ష పార్టీలు హడావుడి చేస్తాయనీ, అధికార పార్టీపై విమర్శలు చేయడం తప్పితే వారు చేసేది ఏమి లేదనీ తెలిపారు.



Next Story