నేను చనిపోతున్నా.. వారిని శిక్షించండి..!

by  |
Suicide
X

దిశ, ఆందోల్:

తన మరణానికి కారణమైన వారికి శిక్షించాలని సూసైడ్ లెటర్ రాసి.. డ్యాంలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. పుల్కల్‎కు చెందిన బుచ్చిరెడ్డి మరణానికి ముందు వరుసకు సోదరుడైన మాణికిరెడ్డికి ఫోన్ చేసి.. తాను సింగూర్ డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పినట్లు ఎస్సై నాగలక్ష్మీ తెలిపారు. తనకు సంబంధించిన ఓ స్థలం వద్ద కొందరు వ్యక్తులు గాలాట చేయడమే తన మృతికి కారణమంటూ ఓ సూసైడ్ లెటర్ రాసినట్లు వెల్లడించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed