చక్రసిద్ధ కేంద్రాన్ని ప్రారంభించిన మహేష్ బాబు

by Shyam |   ( Updated:2021-08-11 05:38:02.0  )
చక్రసిద్ధ కేంద్రాన్ని ప్రారంభించిన మహేష్ బాబు
X

దిశ, హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య శ్రీమతి నమ్రతతో కలిసి నగర శివార్లలోని శంకర్‌పల్లి సమీపంలోని మోకిల వద్ద నయం చేయలేని వ్యాధుల నుండి ఉపశమనం కలిగించే కేంద్రమైన చక్రసిద్ధను ప్రారంభించారు. శ్రీ వరప్రసాద్ రెడ్డి, శాంత బయోటెక్నిక్స్ ఛైర్మన్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది తమ బాధలను అంతం చేయడానికి, నొప్పి లేని జీవితాన్ని గడపడానికి కట్టుబడి ఉండాలనుకునే వారికి సిద్ద వైద్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్ సత్య సింధూజ తెలిపారు. యోగా సైన్స్ మద్దతుతో, సిద్ధ హీలింగ్, 4000 సంవత్సరాల పురాతనమైనదని, మానవ ఉనికి యొక్క భౌతిక, ఆధ్యాత్మిక, మానసిక అంశాలలో స్థిరమైన సమతుల్యతను వెలిగిస్తుందని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. అరుదైన చికిత్సా పద్ధతిని అందించే కేంద్రాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఇది కేవలం వ్యాధిని నయం చేసే పద్ధతి మాత్రమే కాదని, మన మొత్తం జీవనశైలిని మార్చడంలో ఇది మనకు సహాయపడుతుందన్నాడు. డాక్టర్ సత్య సింధూజ చక్రసిద్ధ నాడీ వైద్యంలో నిపుణురాలు. ప్రపంచం మొత్తంలో ఈ రకమైన చికిత్సలో నిపుణురాలుగా ఉన్న ఏకైక వ్యక్తి ఆమె మాత్రమే. మైగ్రేన్, వెర్టిగో లేదా కొన్ని కండరాల వ్యాధులను నయం చేయడానికి ఇది కేవలం ఒక చికిత్స కాదని నేను అనుకుంటున్నాను. దీని ద్వారా ఏదైనా వ్యాధిని నయం చేయవచ్చు. నాకు అనిపించేది ఏమిటంటే, డా. సింధూజ సూచనల ప్రకారం పద్ధతులను పాటిస్తే, మనం అద్భుతాలను చూడవచ్చు. మన జీవనశైలిని కూడా సరిగ్గా సెట్ చేసుకోవచ్చు. ఈ ప్రామాణికమైన, ప్రాచీనమైన, సాంప్రదాయ చికిత్సను ప్రోత్సహించడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అని మహేష్ బాబు అన్నాడు.

Advertisement

Next Story