కరోనాతో మహాత్మాగాంధీ ముని మనవడు మృతి

by vinod kumar |
కరోనాతో మహాత్మాగాంధీ ముని మనవడు మృతి
X

దిశ, వెబ్‎డెస్క్: కరోనా బారిన పడి మహాత్మా గాంధీ ముని మనవడు సతీష్ ధుపేలియా కన్నుమూశారు. గత కొంతకాలంగా న్యూమోనియా బాధపడుతున్న సతీష్.. నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన కరోనా బారిన పడ్డారు. మూడు రోజుల క్రితమే పుట్టిన రోజు జరుపుకున్న ధుపేలియా ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో సౌతాఫ్రికాలోని జోహెన్నెస్ బర్గ్ లో మరణించారు. ఈ విషయాన్ని ఆయన సోదరి ఉమా ధుపేలియా-మెస్త్రీ వెల్లడించారు. కాగా, సతీష్‌ తన జీవితంలో ఎక్కువ కాలం మీడియా రంగంలో వీడియో గ్రాఫర్, ఫొటో గ్రాఫర్‌గా పనిచేశారు. మరోవైపు సౌతాఫ్రికాలో గాంధీ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌ కార్యకలాపాలు నిర్వహించేవారు.

Advertisement

Next Story

Most Viewed