- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
వేణు స్వామి సంచలన నిర్ణయం.. ఇకపై జాతకాలు చెప్పనంటూ..
దిశ, ఫీచర్స్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తాను చెప్పిన దానికి భిన్నంగా రావడంతో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి హర్ట్ అయ్యాడు. ఇక నుంచి జాతాకాలు చెప్పడం మానేస్తున్నట్లు ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్ హల్ చల్ చేస్తోంది. ఎంతో కాలంగా జ్యోతిష్యం చెప్పడాన్ని వృత్తిగా కొనసాగిస్తున్నాడు వేణుస్వామి ఎంతోమంది ప్రముఖులు, సెలబ్రిటీలకు జాతకాలు చెప్పాడు. కొన్నిసార్లు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల విషయంలో ఆయన చెప్పిన జోష్యం నిజం అయిందనే ప్రచారం కూడా ఉంది. అలాగే ఆయన చెప్పేవి ఎల్లప్పుడూ నిజం కావవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.
ఏపీ ఎన్నికల నేపథ్యంలో వేణుస్వామి వైసీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని, జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవుతాడని జోష్యం చెప్పాడు. కానీ తాజా ఫలితాల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో పలువురు టీడీపీ, అలాగే కూటమి అభిమానులు వేణు స్వామిని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటావంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తన జోష్యం నిజం కాలేదన్న బాధలో ఉన్న వేణు స్వామి, ఈ నెగెటివ్ ట్రోల్స్తో తీవ్ర అసంతృప్తి గురై, ఇక నుంచి జాతకాలు చెప్పకూడదనే నిర్ణయం తీసుకున్నాడు. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుంగా, నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.