- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ కల వస్తే నిజంగానే ఆరు నెలల్లో చనిపోతారా?

గుడ్లగూబ గురించి కలలు కన్నప్పుడు, ఏదైనా గ్రామాన్ని ఖాళీ చేయడం కానీ, ధ్వంసం చేస్తున్నట్లు కల వస్తే మృత్యువు సమీపిస్తున్నట్లేనంట. అలాగే కాకి లేదా గద్ద తలపై కూర్చున్నట్లు కల వచ్చినా అది మరణానికి సంకేతమేనంట.
అలాగే శివపూరాణం ప్రకారం.. పార్వతీ దేవి ఒకసారి తన భర్త శివుడిని ఇలా అడుగుతుంది.స్వామి మరణానికి సంకేతం ఏమిటి? మరణం రాబోతుందని ఎలా తెలుసుకోవచ్చు అని ప్రశ్నించగా? పరమశివుడు మాట్లాడుతూ..ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా తెలుపు కొద్దిగా ఎరుపు రంగులోకి మారినప్పుడు ఆ మనిషి మరో ఆరునెలలో చనిపోతున్నట్లు అర్థం. అలాగే ఒక పిట్ట నీళ్లలో మునిగి తేలుతున్నట్లు కనిపించిన వారు త్వరలో చనిపోతున్నారు అనే అర్థం అని తెలియజేశాడంట. ఇక వీటిని కొంత మంది నమ్మితే మరికొంత మంది మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తారు. నోట్ : ఇది ఇంటర్నెట్లో ఇచ్చిన సమాచారం మేరకే ఇవ్వబడినది, దిశ దీన్ని ధృవీకరించలేదు.