- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
AP News:కాకినాడ రూరల్ ఎంపీపీ పదవి జనసేనకే!
by Jakkula Mamatha |

X
దిశ,కాకినాడ రూరల్: కాకినాడ రూరల్ ఎంపీపీ పదవి జనసేన హస్తగతమైంది. ఇప్పటి వరకు కాకినాడ రూరల్ ఎంపీపీ వైఎస్సార్ కాంగ్రెస్ చేతిలో ఉంది. అయితే 18 స్థానాలకు మూడు స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఉండగా తాజాగా ఏడుగురు వైసీపీ సభ్యులు జనసేనలో చేరిపోయారు. ఎన్నికల సందర్భంగా వీరంతా లంబసింగి శిబిరంలో ఉన్నారు. గురువారం ఎంపీపీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లంబసింగి నుంచి ఈ సభ్యులు నేరుగా గురువారం ఎండిఓ కార్యాలయానికి చేరుకుని ఎంపీపీని ఎన్నుకున్నారు.
తొలినుండి ఆ కుర్చీ తమదేనని జనసేన ధీమా వ్యక్తం చేస్తోంది. కాకినాడ రూరల్ఎంపీపీ ఎన్నికను 8 మంది ఎంపీటీసీలు బహిష్కరించారు. వైసీపీ నుంచి జనసేనలోకి ఏడుగురు చేరారు. పది మంది ఎంపీటీసీలతో ఎమ్మెల్యే నానాజీ ఎంపీడీవో కార్యాలయానికి వచ్చారు. కాకినాడ రూరల్ ఎంపీపీగా జనసేన ఎంపీటీసీ నందిపాటి అనంతలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Next Story