మీ పిల్లలు జలుబుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఆహారంలో ఇది చేర్చండి!

by Jakkula Samataha |
మీ పిల్లలు జలుబుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఆహారంలో ఇది చేర్చండి!
X

దిశ, ఫీచర్స్ : వర్షాకాలం వచ్చిందంటే చాలా వ్యాధులు విజృంభిస్తుంటాయి.ముఖ్యంగా చాలా మంది జలుబు, దగ్గుతో బాధపడిపోతుంటారు. రోగనిరోధక శక్తి కూడా చాల తగ్గి అనేక వ్యాధుల బారిన పడే ఛాన్స్ ఉంటుంది. అందువలన వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కాగా, అసలు ఈ సీజన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇక వర్షాకాలంలో పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచడానికి కలకండ్ క్రిస్టలైజ్డ్ తాటి బెల్లం పెట్టాలంట. ఈ సమయంలో చాలా మంది పిల్లలు కఫం సమస్యల భారిన పడుతుంటారు.అయితే వారికి ఈ సీజన్‌లో ప్రతి రోజూ ఈ పానకం పెట్టడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందంట. ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న పిల్లలకు ప్రతి రోజూ శొంఠి, బెల్లంతో కలిసి తయారు చేసే ఈ పానకాన్ని పెట్టడం వలన ఆరోగ్యం బాగుంటుందంట.

Advertisement

Next Story

Most Viewed