నమస్కారం ఎందుకు పెట్టాలో తెలుసా?

by Prasanna |
నమస్కారం ఎందుకు పెట్టాలో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారమని మన పెద్దలు చెబుతుంటారు. తల్లి దండ్రుల విషయంలో నమస్కారం ఎవరికి పెట్టాలని సందేహం వస్తుంది.. చాలా మంది ముందు తండ్రి అని చెబుతారు.. కానీ ఇక్కడ వేదాలు ఏమి చెబుతున్నాయంటే.. మాతృదేవోభవ.. పితృదేవోభవ.. అన్నాయి కాబట్టి తల్లికే ప్రథమ స్థానం. అవతలి వారు కుడి పాదాన్ని కుడి చేతితో పట్టుకొని, ఎడమ పాదాన్ని ఎడమ చేతితో పట్టుకొని మనస్ఫూర్తిగా పాదాల మీద బొటన వేలు పట్టుకొని.. అప్పుడు నమస్కారం చేయాలి. అలా చేసుకున్న నమస్కారమే సరయిన నమస్కారమట. అలా నమస్కారం చేసినప్పుడు విద్యుత్ శక్తి మానవ శరీరంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఒకరికి నమస్కారం చేయడం వలన మనలో ఉన్న శక్తి ఇంకా అభివృద్ధి అవుతుందట.

Next Story

Most Viewed