సమస్యల పరిష్కారానికి.. వెంటనే చర్యలు తీసుకోవాలి

by  |
సమస్యల పరిష్కారానికి.. వెంటనే చర్యలు తీసుకోవాలి
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో ఆయన సమావేశమై జిల్లాలోని పలు సమస్యలపై చర్చించారు.

నార్కట్‌పల్లి-అద్దంకి హైవేలో భాగంగా తిప్పర్తి గుండా నుంచి వెళ్లే బైపాస్ రోడ్డు భూ సేకరణ సమస్య, పిల్లాయిపల్లి కాల్వ కెనాల్ భూ సేకరణ సమస్యలు పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కి సూచించారు. అలాగే కంబాలపల్లి అటవీ సమస్యపై చర్చించారు. ఆ ప్రాంత రైతులకు నష్టం కలగకుండా చూడాలని తెలిపారు.


Next Story

Most Viewed