BREAKING: టీడీపీలో చేరిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్..

by Disha Web Desk 1 |
BREAKING: టీడీపీలో చేరిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్..
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పర్వం ముగిసిన వేళ అధికార వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కాసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ మేరకు డొక్కాకు పసుపు కండువా కప్పి బాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా, ఉదయం ఆయన వైఎస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదేవిధంగా రాజీనామా లేఖను సీఎం జగన్‌కు పంపించారు. వైసీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న డొక్కా.. కొన్నాళ్ల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన సీఎం జగన్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన డొక్కా టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ పదవి హామీతోనే ఆయన టీడీపీలో చేరారని గుంటూరు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.



Next Story

Most Viewed