- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
సీఎం చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్.. ఇవాళ స్పెషల్ మీట్!
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ ((Tollywood Star Hero Jr. NTR), రామ్చరణ్ (Ram Charan)లు ఈ రోజు స్పెషల్గా మీట్ అవనున్నారు. వరదబాధితులకు అందించాల్సిన సహాయ సహకారాలపై చర్చించి అనంతరం తమ వంతుగా ప్రకటించిన విరాళాన్ని ముఖ్యమంత్రికి అందజేయనున్నారు. అయితే ఈ మీటింగ్లో జూనియర్ ఎన్టీఆర్, సీఎం చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) మీట్ అవడంపైనే ఇప్పుడు స్పెషల్గా ఫోకస్ చేస్తున్నారు తారక్ అభిమానులు. దానికి కారణం చాలాకాలంగా టీడీపీ (TDP)కి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నాడనే ఆరోపణలున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో కానీ, ఫ్యామిలీ మీటింగ్స్లో కానీ సీఎం చంద్రబాబు, తారక్ చాలా తక్కువగా కలుస్తున్నారు. అలాంటిది ప్రస్తుతం విజయవాడ వరదల (Vijayawada) నేపథ్యంలో వరద బాధితుల కోసం విరాళం ప్రకటించిన నేపథ్యంలో ఆ విరాళాన్ని నేరుగా సీఎంకు అందించేందుకు తారక్ సిద్ధం కావడంతో ఇప్పుడు వీరిద్దరి మీటింగ్పై అంతా ఆసక్తిగా ఉన్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడ మొత్తం 10 రోజులకు పైనే జలదిగ్భంధంలో ఉన్న విషయం తెలిసిందే. భారీగా ఆస్తినష్టం సంభవించగా 45 మందికి పైగా ప్రాణాలు కూడా కోల్పోయారు ఈ క్రమంలోనే అనేకమంది సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలతో పాటు సామాన్యులు కూడా భారీగా విరాళాలు ప్రకటించి వరదబాధితులకు అండగా నిలుస్తున్నారు.