రాజీలేని పోరాట యోధుడు..!

by  |
రాజీలేని పోరాట యోధుడు..!
X

దిశ, ముషీరాబాద్: రాజీలేని పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని శాసన మండలి మాజీ అధ్యక్షుడు కనకమామిడి స్వామిగౌడ్ అన్నారు. ఆదివారం నారాయణగూడలోని పద్మశాలి భవన్‎లో అఖిల భారత పద్మశాలి సంఘం, వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామి గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్, ఏఎల్ మల్లయ్యలను సంఘం సభ్యులు సత్కరించారు.

ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ చిన్నతనంలోనే ఉద్యమస్ఫూర్తిని పెంచుకున్నారని అన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం బాపూజీ ఎంతగానో కృషి చేశారని, వారి ఆశయాలను భావితరాలకు తెలియజెప్పాలని పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed