పీఎస్ ఆవరణలో.. ప్రేమజంటపై కత్తితో దాడి

by  |
పీఎస్ ఆవరణలో.. ప్రేమజంటపై కత్తితో దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు ప్రేమికులపై కొందరు కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లాలోని పాపన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకోవడమే ఈ దాడికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఇటీవలే కులాంతరం వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట తమకు ప్రాణాపాయం ఉందని.. రక్షణ కల్పించాలంటూ పాపన్నపేట పోలీసులను ఆశ్రయించింది. అనంతరం పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో వారిపై కత్తితో దాడి జరిగింది.కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.


Next Story

Most Viewed