మెగా హీరోలను నమ్మనంటున్న కియారా

by Shyam |
మెగా హీరోలను నమ్మనంటున్న కియారా
X

బాలీవుడ్ దివా కియారా అద్వానీ… తెరపై అందం, అభినయం, అమాయకత్వం, చిలిపితనంతో ఆకట్టుకుంటుంది. కబీర్ సింగ్‌లో ప్రీతిగా కుర్రాళ్ల గుండెల్లో గూడుకట్టుకున్న కియారా ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది.

టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు జోడిగా భరత్ అను నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కియారా. ఈ సినిమా సూపర్‌హిట్ కావడంతో వెంటనే మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్న కియారా డిజాస్టర్‌ను చవిచూసింది. దీంతో ఆ తర్వాత తెలుగులో ఏ సినిమా చేయలేదు. కానీ, మళ్లీ మహేష్ కాంబినేషన్‌లోనే మూవీకి ఓకే చేసిందట అమ్మడు. వంశీ పైడిపల్లి, మహేష్ బాబు సినిమాలో నటించేందుకు రెడీ అయిందట.

అయితే అంతకు ముందే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలని డైరెక్టర్ క్రిష్ కియారాను కలిశారట. కానీ ఇందుకు నో చెప్పిందట ఈ భామ. కాల్షీట్లు సర్దుబాటు కాక వద్దనుకుందేమో అనుకున్నారు. అందుకే మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్, సాయి కొర్రపాటి సినిమాలను కూడా రిజెక్ట్ చేసింది అనుకున్నారు. కానీ, ఆ తర్వాత వచ్చిన మహేష్ సినిమాకు మాత్రం ఎస్ చెప్పిందట కియారా. దీంతో ఇదంతా వినయ విధేయ రామ డిజాస్టర్ ఎఫెక్టే అంటున్నారు కొందరు విశ్లేషకులు. కియారాకు మెగా ఫ్యామిలీ హీరోలపై నమ్మకం పోయిందని, మెగా హీరోలకు యాక్టింగ్, స్టోరీ సెలక్షన్ గురించి ఏమీ తెలియదని అభిప్రాయపడుతుంది అనుకుంటున్నారు. మరి మెగా హీరోలు ఇద్దరికి నో చెప్పి మహేష్‌కు ఓకే చెప్పిందంటే అదే అనుకుంటారు ఎవరైనా.

Advertisement

Next Story