గోడలపంపులో కరోనా పాజిటివ్.. గ్రామాన్ని సందర్శించిన జేసీ

by Aamani |
గోడలపంపులో కరోనా పాజిటివ్.. గ్రామాన్ని సందర్శించిన జేసీ
X

దిశ, ఆదిలాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ప్రతిరోజూ విపరీతంగా పెరుగుతున్నాయి. విస్తృతంగా వ్యాప్తిచెందుతూ రాష్ర్టంలో కరోనా విలయతాండవం చేస్తోంది. గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గోడలవంపు గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే హుటాహుటిన బాధితున్ని హైదరాబాద్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వెంటనే గ్రామాన్ని నిర్మల్ జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో, స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అందరూ ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్పా ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రావొద్దని అన్నారు. అలాగే వైద్య సిబంది ఇంటిఇంటి సర్వే నిర్వహించి ప్రజలకు సూచనలు తెలియజేయాలని కోరారు. గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించి రాకపోకలు నిలిపివేశారు.



Next Story