విజయానికి ప్రతీక నేవీ డే.. ఈసారి లేనట్లే!

by srinivas |
విజయానికి ప్రతీక నేవీ డే.. ఈసారి లేనట్లే!
X

దిశ, విశాఖపట్నం : పాకిస్తాన్‌పై భారత్‌ సాధించిన విజయానికి ప్రతీకగా ఏటా డిసెంబర్‌ 4న నిర్వహించే నేవీ డేను ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు తూర్పు నౌకాదళ అధికారులు తెలిపారు. నేవీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి భారీ స్ధాయిలో ప్రజలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేవలం వర్చువల్‌ విధానంలో వేడుకులను నిర్వహించాలని అధికారులు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

వాస్తవానికి ప్రతి ఏటా విశాఖ ఆర్కేబీచ్‌ వేదికగా నేవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని యుద్ధనౌకలు, నేవీ సిబ్బంది విన్యాసాలు, రిహార్సల్స్‌ జరుగుతుంటాయి. కేవలం కరోనా నేపథ్యంలోనే ఈసారి విన్యాసాలను రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ నెల 3న విశాఖ తూర్పు నౌకదళం ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed