- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఐపీఎల్లో నేడు.. రసవత్తర పోరు
by Anukaran |

X
దిశ, వెబ్డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా శనివారం రసవత్తర పోరు జరుగనుంది. షార్జా వేదికగా రాత్రి 7:30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్కు చాలా కీలకం కానుంది. ప్లేఆఫ్స్ రేసులు ఉండాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాలి. ఐపీఎల్లో మొత్తం ఇప్పటివరకూ 12 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ పది పాయింట్లు సాధించింది. అంతేగాకుండా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ మ్యాచ్లో గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్కు చేరుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఎలాగైనా నెగ్గాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్లో ఓడిపోతే.. హైదరాబాద్కు ప్లేఆఫ్స్ అవకాశాలు ఉండవు. ఈ క్రమంలో నేటి మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.
Next Story