నా ప్రియుడు లేకపోతే బతకలేను.. మమ్మల్ని కలపండి.. యువకుడు హల్‌చల్..

by srinivas |
నా ప్రియుడు లేకపోతే బతకలేను.. మమ్మల్ని కలపండి.. యువకుడు హల్‌చల్..
X

దిశ, ఏపీ బ్యూరో: నా ప్రియుడు లేకపోతే నేను బతకలేను. నా ప్రియుడిని నన్ను కలపండి అంటూ ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. సృష్టికి విరుద్ధమైన ఈ ఘటన కడప జిల్లా మైదుకూరులో చోటు చేసుకుంది. అంతేకాదు తన ప్రియుడిని తనను కలిపి తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌ జిల్లా తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన కంది సాయి కుమార్‌‌ దుబాయ్‌లో పని చేస్తున్నాడు. అతడికి టిక్ టాక్ ద్వారా మస్కట్‌లో ఉద్యోగం చేస్తున్న మైదుకూరు యువకుడితో పరిచయం ఏర్పడింది.

దీంతో ఇద్దరు తమ సెల్ ఫోన్‌ నంబర్లు మార్చుకుని రోజూ గంటల తరబడి మాట్లాడుకునేవారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే మైదుకూరుకు చెందిన యువకుడు సాయికుమార్‌కు ఫోన్ చేసి నువ్వు లేకపోతే నేను బతకలేను.. మనం పెళ్లి చేసుకుందాం.. మస్కట్ వచ్చెయ్యమని బతిమిలాడాడు. దీంతో సాయి కుమార్ మస్కట్ వెళ్లిపోయాడు. అక్కడ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.

అయితే తన ప్రియుడు కొద్ది రోజులకు తనకు దురమయ్యాడని సాయికుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని పేర్కొన్నారు. మైదుకూరు పోలీస్‌స్టేషన్‌ బయట ఆత్మహత్యకు ప్రయత్నించగా యువకుడి బంధువులే చికిత్స చేయించినట్లు వెల్లడించాడు. యువకుడు తనతో ఓ రకంగా, తల్లిదండ్రుల వద్ద మరో రకంగా మాట్లాడుతున్నారని.. అతను లేకపోతే తాను బతకలేనని సాయి కుమార్‌ విలపిస్తున్నాడు. తమను ఎలాగైనా ఒకటి చేయాలని వేడుకుంటున్నాడు.

న్యూడ్‌గా కనిపించినా అవకాశాలు రావు.. నటిపై షాకింగ్ కామెంట్స్

Next Story

Most Viewed