- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: కడుపులో ఉన్నది ఆడో, మగో తెలుసుకోవాలంటే కొంతమంది డాక్టర్లను ఆశ్రయిస్తారు. కానీ, ఓ భర్త తన భార్య గర్భంలో ఉన్నది ఎవరో తెలుసుకునేందుకు పొట్టనే చీల్చాడు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నేక్పూర్ అనే గ్రామంలో పన్నాలాల్ అనే వ్యక్తికి ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఆయన భార్య మరోసారి గర్భవతి అయింది. దీంతో ఈ సారి కూడా ఆడపిల్ల పుడితే ఎలా అని ఆందోళన చెందిన పన్నాలాల్.. ఓ పదునైన వస్తువుతో భార్య పొట్ట చీల్చాడు. భర్త విపరీత చేష్టకు ఆ గర్భవతి తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడిపోయింది. ఆమెను గమనించి స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బరేలీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పన్నాలాల్ను అరెస్ట్ చేశారు. కొడుకు పుట్టాలని కోరుకుంటున్న పన్నాలాల్ ఈ దారుణానికి పాల్పడ్డారని కుటుంబసభ్యులు ఆరోపించారు.