స్మార్ట్ ఫోన్ వల్లే ఆ వ్యాధులు వస్తున్నాయంటూ సర్వేలో షాకింగ్ నిజాలు బయట పెట్టిన పెట్టిన నిపుణులు

by Prasanna |
స్మార్ట్ ఫోన్ వల్లే ఆ వ్యాధులు వస్తున్నాయంటూ సర్వేలో షాకింగ్ నిజాలు బయట పెట్టిన పెట్టిన నిపుణులు
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం మనలో చాలా మంది సగం జీవితం స్మార్ట్ ఫోన్ లోనే గడిపేస్తున్నారు. కానీ, ఇదే ఫోన్ మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుందన్న విషయం తెలుసా.. అవును మీరు చదువుతున్నది నిజమే.. ఎక్కువ సమయం ఫోన్ లో గడిపే వాళ్ళకి అనేక సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు తాజాగా చేసిన సర్వేలో షాకింగ్ నిజాలు బయట పెట్టారు.

ముందుగా కడుపు నుంచి మొదలయి ఆ తర్వాత శరీరమంతటా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. ప్రజలు, వారి ఫోన్‌లను ఎక్కడికి పడితే తీసుకువెళుతున్నారు. ఇంకా చెప్పాలంటే బాత్రూంలో కూడా ఎదో పని చేసినట్టు వాడుతున్నారు. ఈ గాడ్జెట్‌లపై అనేక బ్యాక్టీరియాలు ఉంటున్నాయని నిపుణులు చేసిన అధ్యయనంలో తేలింది. దీనివల్ల కొత్త వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఫోన్ వేడిని ఉత్పత్తి చేస్తుంది ఇక్కడ బ్యాక్టీరియా చాలా ఈజీ గా పెరుగుతుంది. బ్యాక్టీరియాతో పాటు వైరస్‌లు, శిలీంధ్రాలు కూడా స్క్రీన్ పై ఉంటాయి. దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయి చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్ పైన కనిపించని స్టెఫిలోకాకస్ ఆరియస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి, భోజనం చేసేటప్పుడు ఫోన్లకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Next Story