ప్రతి సంవత్సరం 24 మిలియన్ల మందికి పిచ్చిపడుతుందన్న wHO.. కీలక విషయాలు వెల్లడి!

by Jakkula Samataha |
ప్రతి సంవత్సరం 24 మిలియన్ల మందికి పిచ్చిపడుతుందన్న wHO.. కీలక విషయాలు వెల్లడి!
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక విషయాలను వెల్లడించింది. ప్రతి ఏటా 24 మిలియన్ల మందికి పిచ్చిపడుతుందని పేర్కొంది. తాజాగా చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపింది. చాలా మంది స్కిజోఫ్రెనియా అనే వ్యాధి బారిన పడుతున్నారంట. ఇది ఓ మానసిక ఆరోగ్య రుగ్మత. సరిగ్గా చెప్పాలంటే పిచ్చి పట్టడం. అంటే వారు ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియకుండా వింత గా ప్రవర్తించడం. ఈ వ్యాధి అనేది సుమారు 24 మిలియన్ల మందిని ప్రభావితం చేసిదంని, ముఖ్యంగా దీని ప్రభావం మహిళలకంటే ఎక్కువగా పురుషులపై ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఈ డిసీజ్ అనేది జీవితాన్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణం, మొదడులోని రసాయన అసమతుల్యత, ముఖ్యంగా డోపమైన్ పెరుగుదల. దీని వలన మానసిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ డోపమైన్ నరాల కణాల మధ్య సందేశాలను ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇది ఏవైనా బలమైన కారణాలు, సమస్యలు, ఇబ్బందులు, సంఘర్షణలతో కూడిన జీవితం, ఒత్తిడి, అనుకున్న పని చేయలేక పోయాను అనే ఒత్తిడి లాంటి సమస్యల వలన ఈ పదార్థం లో తేడా వస్తుంది. దీంతో స్కిజోఫ్రెనియా అనే వ్యాధి ప్రబలుతుంది. ఈ వ్యాధి సోకిన వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అయితే దీని లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం :

తనతో తాను మాట్లాడుకోవడం, భయం, చిలిపి పనులు చేయడం, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం

కారణం లేకుండా ఏడవడం, నవ్వడం, పరుగులు తీయడం, తనను తానే కొట్టుకోవడం.

దీనిపై ఆసక్తి లేకుండా ఉండటం. ఏ పని చేయాలనిపించకపోవడం.

కనిపించని వ్యక్తితో మాట్లాడటం, అద్దంలో చూసుకొని చిలిపి పనులు చేయడం.

Advertisement

Next Story

Most Viewed